విశాలాంధ్ర – చాట్రాయి : జగన్ మోహన్ రెడ్డి పాలనకు పతనం ప్రారంభమయిందని తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. గురువారం చంద్రబాబు ముంపుప్రాంతాల పరీశీలనకు వెళ్ళుతున్న సందర్భంగా తన అనుచరులతో కలిసివెళ్ళి స్వాగతం పలికారు. ఈసందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యం వలనే అబివృద్ది కుంటుపడిందని అన్ని రంగాల్లో వైఫల్యం చెందిదన్నారు.పరిపాలన దక్షుడైన చంద్రబాబు పాలనకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.