Friday, April 19, 2024
Friday, April 19, 2024

గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే

సంక్షేమ పథకాల రథసారధిగా జగన్
నవరత్నాల ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే వాసుబాబు

గణపవరం: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ రథసారధిగా నిలిచారని, నవరత్నాలు ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. బుధవారం
గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గణపవరం గ్రామంలో బస్టాండ్ వద్ద నుండి 54 వ రోజు ప్రజా సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నదన్నారు. ఏ వీధికి వెళ్ళినా , ఏ గడపకి వెళ్లినా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాల అమలు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి, గ్రామ సర్పంచ్ మూర అలంకారం, ఎంపీపీ దండు వెంకటరామరాజు, వైసిపి గణపవరం మండలం అధ్యక్షులు దండు రాము, వైస్ ఎంపీపీ సలాది రత్న దుర్గాకుమారి, ఎంపీడీవో గద్దల జ్యోతిర్మయి, గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1 డి ఎస్ ఆర్ ప్రసాద్, తోటశీను, మూర భాస్కరరావు, శెట్టి త్యాగరాజా, వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img