Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆహార భద్రతా హక్కు ను రక్షించండి…?

తెలుగు తమ్ముళ్ల డిమాండ్

విశాలాంధ్ర – చాట్రాయి : ఆహార భద్రత రాజ్యాంగం కల్పించిన హక్కు అని దీన్ని కూడా తూట్లు పొడుస్తున్నారని పేదలహక్కులను రక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల కమిటీ డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు లో సోమవారంతెలుగు దేశంపార్టీ చాట్రాయి మండల అధ్యక్షులు మరియు చిట్టిబాబు ఆధ్వర్యంలో తాసిల్దార్ విశ్వనాథ రా కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి మాట్లాడుతూ. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కూడా రక్షణ కల్పించకుండా అర చేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకమన్నట్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ. తెలుగుదేశం పాలనలో అన్ని పండుగలకు కానుకలు అందించిన ఘనత చంద్రబాబుకి దక్కిందన్నారు. వందల కోట్ల రూపాయల విలువైన ఆహారధాన్యాలను ఇచ్చిన విషయాన్నిగుర్తు చేశారు. మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ. దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్బొట్టు రామచంద్రరావు సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి మాజీ సర్పంచులు కే జోషి ఇజ్జిగాని వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img