Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విలీన పంచాయితీలకు వసతులు కల్పించండి

ఏలూరు : ఏలూరు కార్పొరేష‌న్‌లో విలీన‌మైన ఏడు పంచాయ‌తీల్లో స‌రైన వ‌స‌తులు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంఛార్జి బ‌డేటి చంటి అన్నారు. స్థానిక 27వ డివిజన్ కండ్రికగూడెం సెంటర్ సచివాలయం వ‌ద్ద జ‌రిగిన ప్రజా చైతన్యయాత్రలో ఆయ‌న పాల్గొని ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ విలీన పంచాయ‌తీల్లో జ‌రిగిన అభివృద్ధి శూన్య‌మ‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌న్నారు. ముఖ్యమంత్రి జగన్ కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి తన ఖజానాను నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతోందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి డివిజన్ ఇంచార్జ్ యడ్లపల్లి శివ, బేజ్జం అచ్చయమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి నాగరాజు, పాలి ప్రసాద్, వినుకొండ శ్యామలరావు, బొడెం వెంకట్రావు, బీమడోలు సురేష్ కుమార్, ఉమ్మడి అరుణ్ కుమార్‌, భీమడోలు ప్రసాద్, ఉప్పు అనిల్, భూతపాటి పవన్ చందు, కొత్తపల్లి ఉషా, కందుల బాలయ్య, జోసెఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img