చాట్రాయి తాసిల్దార్ విశ్వనాథ రావు
విశాలాంధ్ర – చాట్రాయి : రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చాట్రాయి తాసిల్దార్ విశ్వనాథ తెలిపారు. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో కంచర్ల సత్యనారాయణs/o వెంకటప్పయ్య నివాసంలో 2250 కేజీల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వవుంచినట్లు తెలిపారు. పి డి ఎస్ డి టి ఆధ్వర్యంలో నిర్వహించిన రైడ్ లో పట్టుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి నట్లు ఆయన పత్రికలకు తెలిపారు . రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఇలా అక్రమంగానిల్వ వుంచినట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.