పెనుమంట్ర ఎస్ఐగా సురేంద్ర కుమార్
పెనుమంట్ర: పెనుమంట్ర ఎస్ ఐ గా సురేంద్ర కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ రమేష్ పెనుగొండకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ ఐ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.