ఎమ్మెల్యే వాసుబాబు
నిడమర్రు: దాతల సహకారంతో దేవాలయాలు అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించాలని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. సోమవారం నిడమర్రు మండలం, పెదనిండ్రకొలను గ్రామంలో స్వయంభు
శ్రీపార్వతి భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గర్భగుడి ఆలయ శిఖరానికి మహా కలశ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుబాబు దైవాన్ని మించిన చింతన లేదని ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు కోడే కాశీ, ఎంపీపీ దనకొండ ఆదిలక్ష్మి,నిడమర్రు మండలం వైసిపి కన్వీనర్ సంకు సత్య కుమార్, నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, పురోహితులు పండితులు పాల్గొన్నారు.