Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనన్న గృహాలు.. పేదల లోగిళ్ళు

ఎంపిపి రామారావు

కొయ్యలగూడెం: జగనన్న గృహాలు పేదల లోగిళ్ళుగా మండల పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు అభివర్ణించారు. వాటి నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన సూచించారు. శనివారం మండలంలోని చొప్పరామన్నగూడెం గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణానికి శంఖు స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఇళ్ళ నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనతతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పేదలు సద్వినియోగం చేసుకుని ఇళ్ళ నిర్మాణం పూర్తీ చేసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖ ఎ.ఇ సతీష్ ప్రభుత్వం అందిచే రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమాలో కొయ్యలగూడెం ఎంపిటిసి సభ్యులు గంటా శ్రీనివాసరావు , చొప్పరామన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు తగరం ఆశీర్వాదం, గవరవరం గ్రామ కమిటీ అధ్యక్షులు చేమకుర్తి సత్యనారాయణ , మాజీ సర్పంచ్ ఎం. రాజకుమార్ , గ్రామ కార్యదర్శి రమేష్ సచివాలయ సిబ్బంది తడిరతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img