టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి
ఏలూరు: టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చి పార్టీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటమే ఏకైక లక్ష్యంగా పార్టీ, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి విజ్ఞప్తి చేశారు.
స్థానిక పవర్ పేటలోని టిడిపి నియజకవర్గ కార్యాలయంలో శనివారం ఏలూరులో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు వస్త్తున్న ప్రజాదరణ, ఓటర్ల పేర్లు నమోదు, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకులు తేరా వెంకటేశ్వరరావు మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేసారు. ఆతర్వాత పాదయాత్రపై ముద్రించిన పోస్టర్లను బడేటి చంటి, ఇతర నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రకు అపూర్వ ప్రజా స్పందన లభిస్తోందని, ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సహాంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అపోహలకు గురికాకుండా పార్టీని విజయపథంలో నడిచేందుకు సహకరించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేసి పదివేలు దాటించాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు పాలి ప్రసాద్, చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, గూడవల్లి శ్రీనివాస్, కొల్లేపల్లి రాజు, నెరుసు గంగరాజు, లంకలపల్లి మాణిక్యాలరావు, రెడ్డి నాగరాజు, బిబిజి తిలక్, జంపా సూర్యనారాయణ, తవ్వా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.