కొయ్యలగూడెం: రెండేళ్లలో నూరుశాతం హామీలను అమలు చేస్తామని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మండలంలో సరిపల్లి గ్రామం లో పిఎసిఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి, ఎంపీటీసీ బండి గంగారత్నం ల ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెల్లం బాలరాజు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలో 98 శాతం హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. రానున్న రెండేళ్లలో నూటికి నూరు శాతం హామీలు అమలు చేసి అర్హులైన వారి అందరికీ లబ్ధి చేకూరేలా పని చేయడం జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం మరల విజయ కేతనం ఎగుర వేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి జగన్ పరిపాలన కొనసాగిస్తారని బాలరాజు తెలిపారు. ముఖ్యమంత్రి తాజాగా ప్రవేశపెట్టిన వైయస్సార్ కళ్యాణమస్తు, పథకం మరో కలికితురాయిగా ప్రజలలో నిలిచిపోతుందన్నారు. గ్రామంలో బాలరాజు పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ అధికారులు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా ఇండ్లు నిర్మించుకునే అర్హులైన లబ్ధిదారుల ఇండ్లను ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించి వారికి చేయూతనివ్వాలని బాలరాజు తెలిపారు. కల్యాణమస్తు ,షాదీ తోఫా, పథకాలను ప్రవేశ పెట్టినందుకు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గoజి మల రామారావు, జెడ్పిటిసి దాసరి శ్రీలక్ష్మి, మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, మందపాటి రామకృష్ణ, తుమ్మలపల్లి గంగరాజు, మట్ట సత్తిపండు, దాసరి విష్ణు, తాడేపల్లి మధు, వామిశెట్టి సత్తిపండు, జన్నె రాజేష్, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.