తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల ధనలక్ష్మి
చాట్రాయి:
కోవర్టులు అని ఎవరిని
అంటారని తెలుగు మహిళ మండల అధ్యక్షురాలుమాఊట్ల ధనలక్ష్మి ప్రశ్నించారు. గురువారం ఆమె విశాలాంధ్రతో మాట్లాడుతూ టిడిపి లో ఉండి వైసిపినిగెలిపించి ఒకే దండను ఇద్దరు కలిపి వేయించుకున్నవారిని ఏమనాలని ఎద్దేవా చేశారు. టిడిపి నూజివీడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముద్దరభోయిన వేంకటేశ్వరరావు ఇటివల నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకమిటీలో కొందరు ముఖ్య నేతలు చాట్రాయి మం సీనియర్ నాయకులను కోవర్టులుగా ఆరోపణలు చేసినసందర్భంగా తెలుగు మహిళా మండల అధ్యక్షురాలిగా వున్న ఊట్లధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కృష్ణారావుపాలెం టిడిపి ఎంపిటీసి అభ్యర్థి గా ఎన్నికలలో పోటిచేస్తే నన్ను ఓడించడానికి బలమైన ప్రయత్నం చేసిన తెలుగుదేశం తరుపున సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి ,వైసిపి తరుపున గెలిచిన ఇద్దరు ఎంపీటీసీలు కలసి విజయోత్సవ ఉరేగింపులో ఒకే దండ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారని విమర్శించారు. సమాచారం తెలుసుకున్న ముద్దరభోయిన ఆరోజే వాళ్ళ ను సస్పండ్ చేస్తానని చెప్పారు. నేడు ఆయనే టిడిపి ద్రోహులను వెంటేసుకుని తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.