విశాలాంధ్ర – కొయ్యలగూడెం : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఘశీటా పద్మశ్రీ పేర్కొన్నారు. కొయ్యలగూడెం లో శనివారం ఎంపీపీ గశీజిమల రామారావు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గశీజిమల దేవిల నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరుస్తూ నాడు నేడు నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని, విద్యార్థుల తల్లుల ఖాతాలలో ప్రతి సంవత్సరం అమ్మబడి నగదును జమ చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ను అందచేస్తున్నారన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి తాము అంకిత భావంతో కృషి చేస్తామని తెలిపారు.జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం కోసం తలపెట్టిన బృహత్కరమైన కార్యక్రమం అని తెలిపారు. కొయ్యలగూడెం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు మంతెన సోమరాజు, ఎంపీటీసీ సభ్యులు గంట శ్రీనివాసరావు, వార్డ్ మెంబర్ పూలపల్లి రవికుమార్, మట్ట శ్రీనివాస్ రావు, చిటికెన నాగార్జున, మారిశెట్టి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.