బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం గణనీయంగా పెరిగింది. సుమారు పది కోట్లకు చేరుకుంది. 2022 చివరికి 98.04 మిలియన్ అంటే 9.804 కోట్ల మంది సీపీసీ సభ్యులుగా ఉన్నారు. 2021 నాటి సభ్యుల సంఖ్యతో పోల్చితే 1.4శాతం పెంపుదల ఉన్నట్లు సీపీఐ కేంద్ర కమిటీ సంస్థాగత శాఖ శుక్రవారం పేర్కొంది. 2022 చివరికి ప్రాథమిక స్థాయిలో 5.07 మిలియన్ల మంది సభ్యులు ఉంటే వార్షిక వృద్ధిరేటు 2.6శాతంగా ఉన్నట్లు వెల్లడిరచింది. జులై ఒకటో తేదీన పార్టీ 102వ వ్యవస్థాపక దినోత్సవం ఉన్న నేపథ్యంలో తాజా నివేదికను వెలువరించింది. మొత్తం సభ్యుల్లో 29.9శాతం అంటే 2.93 కోట్ల మంది మహిళలున్నారని, హాన్ మినహా సంప్రదాయ వర్గీయులు 7.6శాతం మేర ఉండగా, పట్టభద్రులు 54.7శాతం మంది ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది. గతేడాది 2.45 మిలియన్ల మంది పార్టీలో చేరారని, మరో 20.96 మిలియన్ల మంది పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
గ్రాండ్ థియేటర్లో కాన్సర్ట్
చైనా కమ్యూనిస్టు పార్టీ 102వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని టియాంజిన్ గ్రాండ్ థియేటర్లో ఈనెల 28న టింజిన్ సింఫనీ ఆర్కెస్ట్రా ఓ కాన్సర్ట్ నిర్వహించింది. చైనా సింఫనీ గేయం ‘గ్రేట్ వాల్’ను 300 మంది బీజింగ్, టియాంజిన్కు చెందిన కళాకారులు ప్రదర్శించారు.