విశాలాంధ్ర,సీతానగరం : జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అన్నింటినీ అందించాలని డ్వామా పిడి కె. రామచంద్రరావు అదికారులను ఆదేశించారు.శనివారం మండలంలోని జగనన్న సురక్ష పథకం అంటిపేట, బగ్గందొరవలస సచివాలయాల్లో ప్రారంభించారు. ప్రజలకు టోకెన్లు జారీ, ఇతర సౌకర్యాలను,జగనన్న సురక్ష పథకం ద్వారా అందుతున్న సేవలు గూర్చి మాట్లాడారు. జగనన్న సురక్ష పథకం ద్వారా సేవలను ప్రతి ఒక్కరికి అందించాలని, ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి ధ్రువపత్రాలను జారీ చేసి, పథకాలను అందించాలని తెలిపారు. జగనన్న సురక్ష పథకం ద్వారా మంజూరు చేసిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా వారికి కావలసిన ధ్రువపత్రాలను ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఒ ప్రసాద్,తహశీల్దార్ ఎన్వీ రమణ, మండల ప్రజాప్రతినిదులు,సర్పంచులు,ఎంపీటీసీలు,అధికారులు,సచివాలయం ఉద్యోగులు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు