విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 40 వార్డు గుట్ట కింద పల్లి లో అదేవిధంగా రూరల్ మండలం ఏలుకుంట్ల బుడ్డారెడ్డిపల్లి గ్రామాలలో ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ శనివారం గొర్రెల మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 70 కిట్స్స్ ను గొర్రెల యజమానులకు అందజేశారు. గ్రామ పట్టణ ప్రజలు ఈ పంపిణీ కార్యక్రమం పట్ల సంతోషమును వ్యక్తం చేశారు. అనంతరం ప్రజలతో కాసేపు ముచ్చటించి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని కదిరి గేటు వద్ద గల నేతన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజగోపాల్ మాట్లాడుతూ ధర్మారం వ్యాపారస్తులపై విజయవాడ అవినాష్ గుప్తా చేసిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ధర్మవరం పట్టుచీరలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. నేతన్నలు ముడి సరుకుల ధరలు పెరిగి పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టి అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రభుత్వానికి తెలియజేసి వారిని ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు. ధర్మవరం వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. వ్యాపారస్తులందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. వీరి వెంట అభిమానులు, అనుచరులు, నాయకులు పాల్గొన్నారు.