సిపిఐ నగర కార్యదర్శి ఎం శ్రీరాములు
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం పట్టణంలోని స్థానిక గుత్తి రోడ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ లో తడి చెత్త, పొడి చెత్త, వేరు చేయడానికి ఏర్పాటు చేసిన సైక్లింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఎం శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి బి రమణయ్య, కె. అలిపిర డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా ఆ ఎరువును రైతులు కొనుగోలు చేసేవారన్నారు. అర్బన్ ఎమ్మెల్యే,మేయర్,కమిషనర్, కార్పొరేటర్లు అందరూ కలిసి సైక్లింగ్ యార్డ్ కు 22 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైక్లింగ్ యార్డ్ కాంట్రాక్టర్ కు బకాయిలు ఇవ్వకపోవడంతో మిషనరీని ఆయన తీసుకొని పోవడం జరిగిందన్నారు . ఇక్కడ చెత్తను అంటించడం వల్ల పర్యావరణ పరిరక్షణ దెబ్బతినడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆస్తమా, క్షయ, శ్వాస కోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం నగరంలోని నాలుగు పంచాయతీల చెత్త యార్డులో డంపు చేస్తున్నారన్నారు. ప్రజలు దగ్గర తీసుకుంటున్న టువంటి చెత్త పన్ను లో కూడా అవినీతి చోటు చేసుకుందన్నారు . వెంటనే సైక్లింగ్ యార్డును ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఇక్కడున్న చెత్తను మున్సిపల్ కార్యాలయం ముందు డంపింగ్ చేసి నిరసన తెలియజేస్తామన్నారు. పట్టణంలో అండర్ డ్రైనేజీ చేస్తామని నాలుగు సంవత్సరాల క్రితం 49 మంది కార్పొరేటర్లు సాక్షిగా పేర్కొనడం జరిగిందన్నారు. అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లుట్ల నారాయణస్వామి, జిల్లా సమితి సభ్యులు బంగారు భాష, చాంద్ బాషా, జిల్లా కమిటీ జయలక్ష్మి, నగర కార్యవర్గ సభ్యులు రజాక్, ప్రసాద్, సూరి, మున్నా, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.