విశాలాంధ్ర -శెట్టూరు : ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ తరుణసాయి ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ గురించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా తయారవుతాయని ఎక్కువ మంది పిల్లలు ఉంటే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ఆమె తెలియజేశారు అధిక జనాభా దేశ ప్రగతికి అవరోధం మేమిద్దరం మాకు ఒక్కరు,అమ్మాయి వివాహ వయస్సు 18 అబ్బాయి వివాహ వయస్సు 21, దేశాభివృద్ధికి కుటుంబ నియంత్రణ పాటిద్దాం బిడ్డకు మధ్య ఎడం పాటిద్దాం
ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు
జనాభా పెరుగుదల దేశ ప్రగతికి అవరోధం అధిక జనాభా పెరుగుదల నష్టాల గురించి ప్రజలకు తెలియజేయలని ఆమె సూచించారు చిన్న కుటుంబం-చింతలేని కుటుంబ నియంత్రణ పాటిస్తే ఆరోగ్య కుటుంబం సాధ్యం అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ వో శోభాలత, సూపర్ వైజర్లు లీలావతి సుమతి,హెల్త్ అసిస్టెంట్ జాన్ సన్ , ఫార్మాసిస్టు యామిని,ల్యాబ్ టెక్నీషియన్ మంజు,ఎఎన్ఎమ్ లు సావిత్రి చంద్రప్రభ,శాంతమ్మ రోజా చిట్టెమ్మ , ఉమ , సునీల,సుజాత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.