విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఆర్టీసీ డిపోలో లో నాయకులు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య సలహాదారులు శ్రీరాములు, జిపి. రెడ్డి,మల్లికార్జున, సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి లు మాట్లాడుతూ ఎంప్లాయిస్ యూనియన్ ద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో విజయాలను సాధించడం జరిగిందన్నారు.. చరిత్ర సాధించిన విజయాలను అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో 92 రోజులు భాగస్వాములమై సాధించుకున్న విజయాల గురించి వారు వివరించారు. అంతేకాకుండా ఇంకను మున్ముందు సాధించబోయే విజయాలను గూర్చి క్లుప్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ నాయకులు ఎన్. నర్సింహులు, బి నర్సింహులు డిపో గ్యారేజ్ కార్యదర్శులు.. ముస్తఫా, మల్లికార్జున, సిస్టం సూపర్వైజర్ సుధాకర్, మహిళా నాయకురాలు అరుణమ్మ ,అనసూయమ్మ, మునెమ్మ,తదితరులు పాల్గొన్నారు..