విశాలాంధ్ర -వలేటివారిపాలెం : ప్రజల కోసమే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం వల్ల పేద ప్రజలు కు ఎంతగానో ఉపయోగపడుతుందని పోలినేనిపాలెం ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర తెలిపారు.శనివారం మండలంలోని పోలినేనిపాలెం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 11 రకాల సర్టిఫికెట్లను అప్పటికప్పుడే పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. గతంలో ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్న రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండేదని, ప్రజలు కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక,సర్పంచ్ అనుమోలు అమరేశ్వరి, ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,డీ టీ హుస్సేన్, మండలమీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండల జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు నాయకులు అనుమోలు సుబ్బారావు,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,అనుమోలు లక్ష్మీనరసింహం,యాళ్ల శివకుమార్ రెడ్డి, అనుమోలు వెంకటస్వామి,వైసీపీ సోషల్ మీడియా మండలకన్వీనర్ బందెల మాల్యాద్రి సచివాలయ సిబ్బంది,గృహసారధులు, వలంటీర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.