విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మంగళవారం జూన్ నెలలో బదిలీ అయినా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బదిలీ అయ్యి ఎంఈఓ గా పదోన్నతి పొందిన చంద్రశేఖర్ తో పాటు గా బదిలీన ఉపాధ్యాయులు నారాయణస్వామి, చాంద్ బాషా, ప్రసాద్ ,షమీమా, ఆంజనేయులు, తదితరులను ఘనంగా సన్మానించి పాఠశాలకు వారి యొక్క సేవలు గురించి వారు అభ్యసన ప్రక్రియ గురించి ఈ పాఠశాలలో పొందిన అనుభూతులను తెలియజేశారు అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్ రాణించాలంటే ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను శ్రద్ధగా విని అవపోషణ చేసుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు అలాగే నూతనంగా ఈ పాఠశాలకు బదిలీపై వచ్చిన వారిని కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి , శివరాజ్ ,ప్రభాకర్, శివ రుద్ర, విజయనాయక్ , సతీష్, గిరిజమ్మ, అక్కమ్మ, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.