చెలికాని బాబ్జి
విశాలాంధ్ర – చాట్రాయి : జగన్ పాలనలో పోలవరం గ్రామంలో రూ. 14 కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్తులకు అందించడం జరిగిందని పోలవరం పి ఎ సి ఎస్ చైర్పర్సన్ చెలికాని బాబ్జి తెలిపారు. బుధవారం పోలవరం గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో 726 మంది లబ్ధిదారులకు రూ.19లక్షల 26 వేల పింఛన్లు ప్రతీ నెలా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.అన్ని సంక్షేమ పథకాలలో రూ.14కోట్ల వరకు పంపిణీ చేసి సామాన్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.సాంకేతి సమస్యల వలన కొంత మందికి అర్హత వున్నా పధకాలు అందడం లేదని అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజలందరూ జగన్నన్నకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం గ్రామ సర్పంచ్ సత్తెనపల్లి లక్ష్మి, ఎంపిటిసి వేముల చిన్న, వేంకటేశ్వరరావు, ఎంపిడిఓ దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.