అదనపు ఎస్ పి ఏవి సుబ్బరాజు
విశాలాంధ్ర – భీమవరం టౌన్ : అనేక రంగాలలో ఉన్న కళాకారులు తన కష్టాలు కడుపులో పెట్టుకొని ప్రేక్షకులను అలరించే విధంగా తనగానం, నృత్యంతోను వినసొంపు అయిన సంగీత వాయిద్యాలతో ప్రజలను నవ్విస్తూ కవ్విస్తూ ఆనందం చేసిన వాడే కళాకారుడని అదనపు ఎస్ పి ఏవి సుబ్బరాజు తెలిపారు. భీమవరం బైపాస్ లో ఉన్న తాపీ పనివారుల సంఘం భవనంలో బుధవారం భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సి ఆర్ మోహన్, అధ్యక్షులు గాతల చక్రవర్తి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అదనపు ఎస్ పి ఏవి సుబ్బరాజు తో పాటు గౌరవ అధ్యక్షులు సి ఆర్ మోహన్, అధ్యక్షులు గాతల చక్రవర్తి, గవర్నింగ్ , జనరల్ బాడీ సభ్యులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా
అదనపు ఎస్ పి ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి కళాకారుడు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని ప్రతి ఒక్కరు హుందాగా ప్రవర్తించాలని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేయరాదని తెలిపారు. కళా రంగం అంటే నాకు చాల ఇష్టమని నేను ఒక కళాకారుడు నేనని తెలిపారు. ఎవరు ఏ రంగంలో ఉన్న ఆ రంగాన్ని దైవంగా భావించాలని అప్పుడే ఆ రంగంలో ఉన్నత శిఖరానికి వారు తెలిపారు. అనంతరం బొబ్బిలి పులి సినిమాలోని నందమూరి తారక రామారావు పాడిన జనని జన్మభూమిశ్చ పాటను పాడి తనదేశభక్తిని చాటిచెప్పారు. భీమవరం కళాకారుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ కొంతమంది బడా బాబులు అక్రమ సంపాదన కోసం ఈవెంట్లు చేసేందుకు ఆర్కెస్ట్రా పేరుతో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నారని అందుకే ఈ సంవత్సరం నుండి మా యూనియన్ తరపున ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. కూటికోసం కోటి విద్యలు అన్న చందంగా మా కళాకారులు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్నారని మా యూనియన్ సభ్యులు ఎవ్వరు చట్టానికి విరుద్ధంగా చేయరని హామీ ఇచ్చారు. దూర ప్రాంతాలు ఈవెంట్స్ కి వెళ్లిన తరుణంలో సౌండ్ సిస్టం వారి వ్యాన్ లను పోలీసు వారు ఆపుతున్నారని కేసులు రాస్తున్నారని అందుకు దయవుంచి మాలాంటి చిన్న కళాకారుల ను ప్రోత్సహిస్తూ కేసు లేకుండా స్థానిక పోలీసులకు సూచించాలని కోరారు. ఒకరోజు కష్టపడితే రూ. 500 నుండి 1500 లోపు వస్తుందని వీటిని కేసులు రూపంలో కట్టాలంటే జీవన ఉపాధి కష్టంగా మారిందని వాపోయారు. మా యూనియన్ కళాకారులు బయటికి వస్తే మా యూనియన్ కార్డు స్థానిక పోలీసుల వారికి చూపిస్తారని దయచేసి మా యూనియన్ వారికి కళా రంగానికి సహకరించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు గాతల చక్రవర్తి మాట్లాడుతూ 2009 నుండి స్టార్ట్ అయిన భీమవరం కళాకారుల అసోసియేషన్ అంచలంచలుగా ఎదుగుతూ నేడు 170 మంది వరకు చేరుతుందని మా యూనియన్ లో ఉన్న సభ్యులు చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి లోబడి ఈవెంట్లు చేస్తారని అలా అని ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే వాటిని యూనియన్ కమిటీ మందలిస్తుందని హామీ ఇచ్చారు. కళారంగాన్ని నమ్ముకుని ఎంతోమంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు. కరోనా తర్వాత కళాకారులకు ఈవెంట్స్ లేక జీవనోపాధి కష్టతరం వుగా మారి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులపై పోలీసులు కరుణ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి సత్యనారాయణ, ఏ రామాంజనేయులు, డి కన్నబాబు, పి ఆనంద్, పురుషోత్తం, రాజు, మూర్తి, బాల, రమేష్ బాబు, నాని, శ్రీనివాసరావు, ప్రసాద్, రాజు, శివరామకృష్ణ, ప్రసాద్, జనరల్ బాడీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.