విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు ఏఐఎస్ఎఫ్ మరియు ఏఐఎస్ఎ మరియు ఎన్ యు ఎస్ ఐ యూనియన్లు కలిసి రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునివ్వగా ప్రవేట్ పాఠశాలలు మాత్రం పాఠశాలలు బంద్ చేయగా ప్రభుత్వ పాఠశాలలు కొంత సమయం వరకు నిర్వహిస్తుండగా అందులోపల యూనియన్ నాయకులు కలగజేసుకొని పాఠశాల బందుకు సహకరించాలని విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వము విద్యా విధానాన్ని నాశనం చేస్తున్నదని వారు నిర్దిష్టమైన డిమాండ్లతో బందుకు పిలుపునిచ్చారు అమ్మఒడి షరతులు లేకుండా ఇవ్వాలని వసతి దీవెన విద్యా దీవెన అందరికీ ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాలని కార్పొరేట్ కాలేజీలో ఫీజులు తగ్గించాలని హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు పెంచాలని మిస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేయాలని కావున ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చినాయి అని అందులో భాగంగా అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడ్డాయి ఈ కార్యక్రమంలో షబ్బీర్ భాష, చిరు ,ఇమ్రాన్ ,ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.