విశాలాంధ్ర-తాడిపత్రి : ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలిసి బిసివై పార్టీ అభివృద్ధికి, రాబోయే ఎన్నికలలో గెలుపుకు కృషి చేయాలని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారము పట్టణానికి చెందిన డాక్ రాజ్ యాదవ్ బిసివై పార్టీ వ్యవ స్థాపకుడు బోడె రామచంద్ర యాదవ్ ను పుంగనూరులోని తన నివాసంలో మర్యా దపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోవు కాలంలో పార్టీ విధివిధానాలు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలలో మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ మేని ఫెస్టో ను, సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ అనేక వర్గాల కింద నలుగుతూ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారంలో ఆర్థిక స్థితి గతుల్లో నుంచి పైకి తీసుకొచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ అధ్యక్షుడితో చర్చించామన్నారు.