విశాలాంధ్ర – తనకల్లు : మహిళలను మహా శక్తులుగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను తెలిపారు మండల పరిధిలోని సి ఆర్ పల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళల కోసం చేపట్టిన మహాశక్తి చైతన్య యాత్రలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలు అందిస్తామని ఇంటిలో ఉండే ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుందన్నారు చదువుకునే పిల్లలకే కాక నిరుద్యోగులకు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని తెలిపారు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరంలోపు మహిళలకు ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు అందించడంతోపాటు వారు ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు గ్యాస్ లీటర్లు ఉచితంగా అందిస్తామన్నారు మహిళా సాధికారత ఆర్థిక అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మొదలైందని అందుకు నిదర్శనం మహిళా రిజర్వేషన్ బిల్లు 33% చేయడమే అన్నారు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త కందికుంట వెంకటప్రసాద్ ను ఎమ్మెల్యే చేసుకోవడంతోపాటు చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి రాష్ట్ర అభివృద్ధికి మన అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి సోమ పాలెం నాగభూషణ మహబూబ్ బాషా ఓబులేసు పకీర్ సాబ్ పిజి మల్లికార్జున హరినాయక్ నాగభూషణ నారాయణస్వామి రెడ్డి సేకర శంకర్ రెడ్డి వెంకట్రామిరెడ్డి తోపాటు నాయకులు కార్యకర్తలు పలువురు మహిళలు పాల్గొన్నారు