విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తారకరామాపురంలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య కులానికి చెందిన అనిల్ కుమార్ మౌనిక దంపతుల కుమార్తె అనురాధ (15 నెలలు) గుండెలో రెండు హోల్స్ ఉన్నందున, వీరిని ఆదుకునే నిమిత్తం అవోపా ధర్మవరం యూనిట్ సంస్థ అధ్యక్షులు సీబా నగేష్ గుప్తా దాతలు సేకరించిన రూ 13,000 లను ఆ కుటుంబానికి సోమవారం వారి గృహానికి వెళ్లి అందజేశారు. అనంతరం నగేష్ గుప్తా మాట్లాడుతూ అనురాధ అనే చిన్న పాపకు ఈ వయసులో గుండెలో రెండు హోల్స్ పడడం బాధాకరమని అనంతపురం, పుట్టపర్తి, తిరుపతి, తదితర హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం చూపించడం జరిగిందన్నారు. రోగం నయం కాకపోవడంతో బెంగళూరుకి వెళ్లడం జరిగిందని ఆపరేషన్ కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలపడం జరిగిందన్నారు. కావున దాతలు ఎవరైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ప్రస్తుతం గుండెలో ఒక హోల్ పూర్తి అయిందని, రెండవ హోల్ ఆపరేషన్ ద్వారా చేయాల్సి ఉందని తెలిపారు. చిన్నారి అనురాధ ఏమి కూడా తినలేక పోతుందని తెలిపారు. కావున దాతలు ఎవరైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఫోన్ పే నెంబర్ 7032455673 కు సంప్రదించాలని తెలిపారు.