విశాలాంధ్ర,పార్వతీపురం: మండలంలోని పెదబొండపల్లి, పుట్టూరు గ్రామాల్లోని రైతుల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా ఒకేచోట కూరగాయల నమూనా పంటలు ఏర్పాటును జిల్లా ప్రోజెక్టు మేనేజర్ షణ్ముఖరాజు మంగళ వారం పరిశీలించారు.రైతులచే ఒకే ప్లాట్ లో వేయించినటువంటి 10 నుంచి 14రకాల అయినటువంటి కాయగూరలు, ఆకుకూరలు, దుంపజాతి తదితర పంటల సాగుద్వారా మంచి ఆహారపదార్ధాలు లభిస్తాయని తెలిపారు. దీన్నే ఏటిఎం మోడల్ గా పిలుస్తున్నట్లు తెలిపారు
రైతు మాటలలో రోజుకి 300 నుంచి 500 రూపాయలవరకు 15 సెంట్లలో ఇటువంటి ఏటిఎం మోడల్ సాగు ద్వారా పలు పంటలు పండించడం ద్వారా ఆదాయం తీసుకున్నట్టు రైతు పి.రామారావువెల్లడించారు
ప్రతి రైతుకూడా ఈవిధంగా ఏటిఎం మోడల్ తరహాలో కూరగాయలు వేసుకున్నట్లయితే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చునని పలువురు రైతులు తెలిపారు.పులిగుమ్మి గ్రామంలో నవధాన్యాల సాగులో 5లి5 క్రాప్ కటింగ్ చేయించడం జరిగిందన్నారు. ఇలా క్రాప్ కటింగ్ చేయించడంవలన భూమిలో ఎన్ని టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుందో రైతులకు క్లుప్తంగా వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చునని చెప్పారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులు పాల్గొన్నారు.