విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రాచర్ల తాండ గ్రామం లో శుక్రవారం జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ ఆధ్వర్యంలో సీజనల్ బాధలపై ప్రజలకు అవగాహన కల్పించారు.దోమల నివారణకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి ఈ స్ప్రే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కువ రోజులు నీటిని నిలువ ఉంచుకోరాదని దోమల వల్ల వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సహాయ మలేరియా అధికారి కే సత్యనారాయణ ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీదేవి ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డి ఉరవకొండ ఐసిడిఎస్ సూపర్వైజర్ తిరుపాల్ బాయ్ కౌకుంట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశ అంగన్వాడి కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.