ముంబయి: దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు అథర్ ఎనర్జీ తన పదేళ్ల వార్షికోత్సవ సంబరాలను పురస్కరించుకొని 450 అపెక్స్ పేరుతో ఒక స్పెషల్ ఎడిషన్ స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో రన్నింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో కెల్లా అత్యంత అందమైన, సొగసైన డిజన్తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఇది ఉంటుందని కంపెనీ సగర్వంగా చెపుతోంది. తొలిసారిగా 450 అపెక్స్ అథర్ ఎనర్జీ స్కూటర్లో వార్ప్G మోడ్ను ప్రవేశపెడుతున్నారు. ఇది అత్యంత వేగవంతమైన వాహనంగా నిలుపుతుంది. ఇది సరికొత్త టెక్నాలజీ. 2వాట్స్ రెజెన్ సామర్థ్యం గల స్కూటర్ల కంటే మెరుగైన రీతిలో 40% అధికంగా బ్రేకింగ్ ఫోర్స్ను కలిగి ఉంటుంది. అథర్ ఎనర్జీ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,89,000 ఉంటుంది. తొలిసారిగా దీంట్లో మ్యాజిక్ ట్విస్ట్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు అథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకులు, సీఈఓ తరుణ్ మెహతా తెలిపారు.