ఇచ్చిన మాట ప్రకారం 3 వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం వైకాపా
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- ఆడిన మాట తప్పని అన్న మన ముఖ్యమంత్రి జగనన్న అని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పథకాన్ని 3 వేల రూపాయలు చేసి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా అని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. చింతపల్లి సచివాలయ – 2 పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె నూతన పెన్షన్ దారు కొప్పు నూకరత్నం కు మూడువేల రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 2000 రూపాయల పెన్షన్ పథకాన్ని 3000 రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్ దారులు మాట్లాడుతూ మాకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసిన జగనన్నకు రుణపడి ఉంటామని, మళ్లీ జగనన్నను సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వర రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.