యూ సి ఐ ఎం చర్చ్ ఫౌండర్ కే ఆర్ సింగ్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్థానిక యూ సి ఐ ఎం చర్చ్ కాపరిగా ” సువార్త అమ్మ ” ను యూ సి ఐ ఎం చర్చ్ ల ఫౌండర్ కే ఆర్ సింగ్ జర్మనీ బృందం సభ్యులతో కలిసి శనివారం నియమించారు. యూ సి ఐ ఎం చర్చ్ పాస్టర్ గా మన్య ప్రాంతంలో విశేష సేవలు అందించిన బ్రదర్ ప్రసాద్ పాస్టర్ గత నెలలో ప్రభువు సన్నిధికి చేరడంతో ఈ ప్రాంత ప్రజలకు ఆయన లేని లోటును భర్తీ చేసే క్రమంలో భాగంగా ఆయన సతీమణి కుంచే సువార్త అమ్మను ఆ చర్చ్ సంఘ కాపరిగా నియమించడమే గాక మండలంలో ఉన్న యూ సి ఐ ఎం చర్చ్ లన్నింటికీ ఆమెనే సూపర్వైజర్ గా నియమించారు. ఈ సందర్భంగా కేఆర్ సింగ్ మాట్లాడుతూ ప్రసాద్ పాస్టర్ లేని లోటు యూ సి ఐ ఎం చర్చ్ లకే గాక, ముఖ్యంగా ఈ ప్రాంతీయులకు తీరనిదన్నారు. ఆయన లేని లోటును ఆయన సతీమణి సువార్త అమ్మ ద్వారా తీర్చాలన్నదే తమ అభిమతమని, అందులో భాగంగానే ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితులుగా ఉన్న ప్రసాద్ పాస్టర్ (లేటు) కుటుంబానికి సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో ఆమెను చర్చ్ కాపరిగాను, యూ సి ఐ ఎం చర్చిలన్నింటికీ సూపర్వైజర్ గా నియమించడం జరిగిందని, సంఘ కాపరిగా ఆమె ఉండటం వలన ప్రసాద్ పాస్టర్ లేని లోటు కొంతవరకైనా తీర్చాలన్నదే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘస్తులు కే పోతురాజు, రుత్తల సతీష్(అర్జున్), కంకిపాటి వీరన్న పడాల్ (బాబులు), చర్చ సంఘస్తులు, యువతి, యువకులు పాల్గొన్నారు.