విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణం నుండి 40 మంది ముస్లింలు ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఉమ్రా టూర్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ కొత్త మసీదు ఇమామ్ హఫీజ్ నయుముల్లా ఆధ్వర్యంలో 40 మంది ఉమ్రా యాత్రకు బయలుదేరారు. పట్టణంలోని ఈద్గా వద్ద వారితో కలిసి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రార్థన నిర్వహించారు. వారి యాత్ర సజావుగా సాగాలని సంతోషంగా తిరిగి రావాలని వారి కుటుంబంతో పాటు ఆళ్లగడ్డ తాలూకా ప్రజలకు మొహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు ఉండాలనని మన ప్రాంతమంతా సస్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, పాడి పంటలతోకళకళలాడాలని అక్కడ ప్రార్థనలు నిర్వహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ సలాం, చింతకుంట్ల రాంశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.