విశాలాంధ్ర,పార్వతీపురం/బెలగాం: నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం ఎన్ రాణి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పెన్షనర్స్ భవనంలో మహిళాదినోత్సవ వేడుకలను జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారిని ఎం.ఎన్ రాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మహిళలఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారిత,మహిళలు సాధిస్తున్న విజయాలను వివరించారు.మహిళలకు పురుషులతో సమానంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు.మహిళలకు కావలసిన పోషకాహార ప్రాధాన్యత గురించి, బాల్య వివాహాలు వలన మహిళలకు కలుగు నష్టాలు గురించి వివరించారు.మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు అహర్నిశలు శ్రమించి పనిచేయాలని సూచించారు.ఐసీడీఎస్ శాఖలో మహిళల భాగస్వామ్యంవల్ల గ్రామాల్లో మహిళలను చైతన్యం చేయాలని కోరారు.దిశ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ లావణ్య దిశచట్టంగూర్చి,మహిళల సమస్యలు గూర్చి వివరించారు.ఎటువంటి సమస్య ఎదురైన సమస్య పరిష్కారం కోసం మహిళలు తోటిమహిళల సలహ తీసుకొని పరిష్కారం చేయాలని కోరారు.నేడు అన్ని రంగాల్లో, అన్ని శాఖలలో మహిళల అభివృద్ధిని వివరించారు.మహిళల రక్షణకు దిశ చట్టం అమలు తీరును వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రముఖ న్యాయవాది ఎస్ ప్రమీల మహిళల రక్షణకు ఉపయోగపడే చట్టాలు గూర్చి వివరించారు.వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పలు అంశాలపై మాట్లాడారు. ఐసీడీఎస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో వివిధ మండలాల సిడిపిఓలు విజయగౌరీ, శ్రీనివాసరావు, సుగుణకుమారి, అనంతలక్ష్మి, సుశీలదేవీ, సుగుణకుమారి ,సత్యవతి, మంగ తాయారు, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీకార్యకర్తలు ,సహాయకులు, ఐసీడీఎస్ కార్యాలయాల సిబ్బంది,మిషన్ వాత్సల్య మహిళా సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.