విశాలాంధ్ర – బెలగాం : ఐఆర్పీడబ్ల్యూఎ సంస్థ వారిచే నడపబడుతున్న మెప్మా మరియు పార్వతీపురం మున్సిపాలిటీ వారి సహకారంతో స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్న పట్టణ నిరాశ్రయులు వసతి గృహంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ బోను గౌరీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ యాళ్ల వివేక్, బందలుప్పి పిహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, కొమరాడ పిహెచ్సీ వైద్యులు డాక్టర్ శిరీష వివిధ రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. సుమారు 100 మంది రోజులను గుర్తించి వారికి పరీక్షించి మందులు హెల్త్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ పుష్ప, ఎఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఐఆర్పీడబ్ల్యూఎ సంస్థ డైరెక్టర్ పికె ప్రకాష్, సిబ్బంది జానీ, గణేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మెప్మా వారి సహకారంతో నార్మల్, కూలింగ్, హాట్ వాటర్ డిస్పానర్ ని పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ బోను గౌరీశ్వరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.