విశాలాంధ్ర-రాజాం (విజయనగరం) : కోస్తా ఆంధ్రా & తెలంగాణలో ప్రముఖ ప్రాధాన్యత కలిగి వినియోగదారుల ఆధరాభిమానాలతో విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయనగరం, దిల్షుక్నగర్ & ఎ.ఎస్.రావ్ నగర్, హైదరాబాద్లలో బ్రాంచీలతో వైభవ్ జ్యూయలర్స్ (మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యూయలర్స్ లిమిటెడ్) ప్రసిద్ధి పొందింది. ఉత్తమ నాణ్యత మరియు అనువైన ధరలతో విభిన్న డిజైన్లలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణములు, ప్లాటినం, రత్నాలు మరియు వెండి ఆభరణములు, పూజా వస్తువులుతో అసంఖ్యాక ఆభరణాల శ్రేణి కలిగి, అసాధారణ అమ్మకాలతో కస్టమర్ల ఆమోదం పొందిన విషయం విదితమే.నేడు, 20 మార్చి 2024న రాజాం, శ్రీ సీతారామ కాంప్లెక్స్, పాలకొండ రోడ్లో వైభవ్ జ్యూయలరీ 14వ షోరూమ్ను విశిష్ట అతిధి సి.ఐ. జగన్నాధ స్వామి (మేనేజింగ్ డైరెక్టర్, సీతరామ (గ్రూప్) ప్రారంభించగా వైభవ్ సంస్థల సి.ఎమ్.డి శ్రీమతి భారత మల్లికా రత్న కుమారి గ్రంధి, అమరేంధ్ర గ్రంధి, సి.ఓ.ఓ గౌంట్ల రాఖాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సింధూరి వెంకటేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ సంధర్భంగా విశిష్ట అతిధులు మాట్లాడుతూ రాజాం పట్టణవాసులకు సుపరిచితమైన విశాఖపట్నం వైభవ్ జ్యూయలర్స్ తమ విస్తృతమైన శ్రేణి మరియు అద్భుతమైన పనితనంగల ఆభరణాలను ఇప్పుడు రాజాం మరియు చుట్టుప్రక్కల ఉన్న వినియోగదారులకు అందించటం శుభపరిణామమని, అభినందనీయమని ప్రశంసించారు.ఈ సంధర్భంగా వైభవ్ సంస్థల సి.ఎమ్.డి శ్రీమతి భారత మల్లికా రత్న కుమారి గ్రంధి మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణిషాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, ఫైన్ జ్యూయలరీ, 925 స్వచ్ఛత కలిగి 100 శాతం తిరిగి కొనుగోలు హామీ గల స్టెర్లింగ్ సిల్వర్ వస్తువులను, సాధారణ వెండి వస్తువులు. మరియు జ్యూయలరీ అందించాలనే ఉద్దేశ్యంతో నేడు తమ వైభవ్ జ్యూయలరీ 14వ షోరూమ్ను రాజాంలో ప్రారంభించుచున్నామని తెలియజేశారు. ప్రారంభోత్సవ కానుకగా బంగారు ఆభరణములపై తరుగు (VA) 9 శాతం నుండి మరియు రూ.150 వరకు తగ్గింపు ప్రతి గ్రాముకు బంగారు ఆభరణములపై, సాధారణ వెండి వస్తువులను తయారీ ఛార్జీలు లేకుండా తమ రాజాం షోరూమ్లో అందిస్తున్నామని, వినియోగదారులు తమ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ సంధర్బంగా జరిగిన “మన రాజాం గురించి తెలుసుకుందాం కాంటెస్ట్” డ్రాలో గెలుపొందిన 10 మంది విజేతలు (ఒక్కొక్కరికి 1 గ్రాము 22 క్యారెట్ బంగారు కాయిన్) లను అందజేస్తారని తెలిపారు…