విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని జోగింపేట కేజీబీవీ పాఠశాలను రాష్ట్ర సమగ్రశిక్ష డిప్యూటీ డైరెక్టర్ డాక్టరు ఎస్ డి వి రమణ గురువారం సందర్శించారు. పాఠశాలలో బాలికలకు అందజేస్తున్న భోజనాలను తనిఖీ చేసారు.స్వయంగా ఆయన భోజనాలను పిల్లలకు వడ్డించారు. పదవతరగతి బాలికల విద్యా, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో రెండవ విడతలో కేజీబీవీకి విడుదలయిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను పరిశీలించారు. భవిష్యత్ లో అన్ని కేజీబీవీలలో సైన్స్ ఉపాధ్యాయినీలందరికి ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పారు. పంచతంత్ర వంద రోజుల పరీక్ష ప్రణాళికా బద్దంగా జరగడం వలన మంచి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువని కొనియాడారు.
ఈకార్యక్రమంలో జి సి డి ఓ రోజారమణి, ఏపిఓవైకెబి హరిప్రసాద్, చొక్కాపు శ్రీనివాసరావు, జోగమ్మపేటకేజీబీవీ ప్రిన్సిపాల్ జొన్నాడ సంధ్య, పాఠశాల సిబ్బంది శైలజ తదితరులు పాల్గొన్నారు.