Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

టి.డి.పి.కూటమి ఎం.పి., ఎమ్మెల్యే అభ్యర్ధులకు సంఘీభావం

తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా మాజీ కో ఆర్డినేటర్ కొమ్మనమంచి

…. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.23.04.2024 ది. అనకాపల్లి జిల్లా లో టి.డి.పి. ఉమ్మడి కూటమి అనకాపల్లి ఎం.పి అభ్యర్ధి సి.ఎం. రమేష్, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి కె. ఎస్.ఎన్.ఎస్.రాజులను బ్రాహ్మణ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా మాజీ కో ఆర్డినేటర్ , రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన యువజన కార్యదర్శి కొమ్మనమంచి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని గవరవరం గ్రామ యువకులు వారిని కలిసి సంఘీభావం తెలియజేసారు. ఎం.పీ., ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. టి.డి.పి. కూటమి అధికారం ఏర్పడ్డాక తమ గవరవరం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి ksn రాజు గార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొట్టాన రాము నాయుడు, జయవరపు రాజు, దాకమర్రి శివ, లక్కవరపు గణేష్, టేకుమూడి బెన్నయ్య, బసనబోయిన నాగేశ్వరవు, పెద్దాడ ప్రవీణ్, గుమ్మాల వినయ్, అమ్మతల్లి, ద్వాదాసుల గణేష్, చవల శివ,అంగులూరి అంజి ,కసిరెడ్డి పవన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img