Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెనల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా 35 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలకు సంబంధించినవి 4 ఫిర్యాదులు, భూ తగాదాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు, మోసాలకు పాల్పడినట్లుగా 8 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించినవి 9 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారు ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హాన్, డిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఈ.నర్సింహమూర్తి, డిసిఆర్బి ఎస్ఐ మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img