వడివడిగా శతవసంతంలోకి అడుగులు.
సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెహ్మాన్, మండల కార్యదర్శి పోతురాజు, ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబు.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- భారత కమ్యూనిస్టు పార్టీ 99 వ వార్షికోత్సవ వేడుకలు చింతపల్లిలో ఆ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ రెహ్మాన్, ఎర్ర బొమ్మల ఎంపీటీసీ సభ్యుడు సెగ్గే సత్తిబాబు లతో కలసి చింతపల్లి వచ్చిన ఆయన స్థానిక పాత బస్టాండ్ కూడలిలో గల సిపిఐ పార్టీ స్తూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి 99 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా 1925 జనవరి 26న ఆవిర్భవించిన పార్టీ సిపిఐ అన్నారు. భూమి కొరకు, భుక్తి కొరకు, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అధికార, ప్రతిపక్షాలపై అలుపెరుగని ఉద్యమాలు చేసి ఎంతోమందికి భూమి పై హక్కు కల్పించిన పార్టీ సిపిఐ అన్నారు. జాతీయ పార్టీగా నేటికీ 99 ఏళ్ళ పూర్తి చేసుకుని శత వసంతంలోకి వడివడిగా అడుగులు వేస్తున్న సిపిఐ పార్టీ ప్రజల పక్షాన నుంచి బూర్జువా పార్టీలపై నేటికీ అలుపెరగని ఉద్యమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు అప్పారావు, అంజలి, కొండలరావు, సత్తిబాబు, రమణ, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.