మజీద్ కమిటీ అధ్యక్షుడు మీరా
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లి మసీదులో నేడు నిర్వహించనున్న ధార్మిక సభను జయప్రదం చేయాలని చింతపల్లి మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మీరా అన్నారు. శుక్రవారం మజీద్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ ముస్లిం లందరూ సామూహికంగా నిర్వహించుకునే ధార్మిక సభను శనివారం చింతపల్లి మసీదు ఆవరణ లో ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. తలనుగుణంగా కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈ ధార్మిక సభకు జమాతే ఇస్లాం రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ మహమ్మద్ రఫిక్, అఫ్రోజ్, అల్లూరి జిల్లా అధ్యక్షుడు ఇబ్రహీం తదితరులు ముఖ్య వక్తలుగా హాజరుకానున్నారని, శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా నిర్వహించబడు ఈ ధార్మిక సభకు ముస్లింలు కుటుంబ సమేతంగా విచ్చేసి ధార్మిక సభను జయప్రదం చేయాలని, ధార్మిక సభ అనంతరం ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం జరిగిందని, వక్త లతో పాటు సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ విందును స్వీకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.