సర్పంచ్ పుష్పలత, ఎంపీటీసీ దారలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నీటి సమస్యలు రానివ్వమని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి దారలక్ష్మి అన్నారు. తమను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న నాటి నుంచి ప్రతీ ఏటా వేసవి కాలం ప్రారంభం అయిన నాటి నుంచి. గ్రామంలో పంచాయతీ పరంగా సర్పంచ్ పుష్పలత, ఎంపీటీసీ గా దారలక్ష్మి తన పరిధి లోని పలు వీధులలో ట్యాంక్ ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను నమ్మి సర్పంచ్, ఎంపీటీసీ లుగా గెలిపించుకున్న ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఇందులో భాగంగా గ్రామంలో నెలకొన్న నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఆలోచన చేస్తున్నప్పటికీ నీటి వనరుల కొరత కారణంగా గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లేక పోయినప్పటికీ, తమపై నమ్మకంతో ఓట్లేసి ప్రజా ప్రతినిధులుగా గెలిపించిన ప్రజలు నీటి సమస్యను ఎదుర్కోరాదనే ఏకైక లక్ష్యంతో ప్రతీ ఏటా నీటి సమస్య తాత్కాలిక పరిష్కారానికి ట్యాంక్ ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.