Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పాడేరు నియోజకవర్గంలో తెదేపా పరిస్థితి ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చినట్లు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చింది అనే చందంగా తయారయింది. మన్య ప్రాంతంలో వైకాపాకు దిటైన పోటీని ఇచ్చే పార్టీగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మన్య ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఉన్నప్పటికీ ప్రతి సారి పొత్తులలో భాగంగా నాడు చింతపల్లి నియోజకవర్గాన్ని, నేడు పాడేరు నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తూ వస్తున్నప్పటికీ తెలుగుదేశం శ్రేణులు నిర్ణయానికి కట్టుబడి ఆయా పార్టీల అభ్యర్థుల విజయానికి శతవిధాల కృషి చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి టిక్కెట్టు కేటాయిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం జనసేనను మిత్రపక్షంగా చేసుకోవడం, అభ్యర్థి ప్రకటన విషయంలో సందిగ్ధతకు తెరలేపకపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ నియోజకవర్గంలో గందరగోళాన్ని నెలకొల్పుతున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కి పాడేరు టిక్కట్టు కేటాయిస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో తెదేపా జనసేన బిజెపి పార్టీలలో ఏ ఒక్కరికి అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినప్పటికీ, ఎన్నికలకు దాదాపు రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఆయా పార్టీలలో ఆశావహులు అందరూ తమ తమ స్థాయిలలో తమకే టిక్కెట్ అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. తెదేపా అధినాయకత్వం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుందో, లేక మిత్ర పక్షాలకు అవకాశం కల్పిస్తుందో అనే మీమాంసలో మన్య ప్రాంతంలోని తెదేపా, జనసేన, బిజెపి శ్రేణులు గందరగోళ పరిస్థితులలో కొట్టు మిట్టాడు తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img