మాజీ ఎంపీపీ బాబురావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా మండల అధ్యక్షునిగా ఉంటున్న మోరి రవి పార్టీకి రెబల్ అభ్యర్థిగా పాడేరు శాసనసభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించడం తగునా అని మాజీ ఎంపీపీ వంతల బాబురావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీకి నిబద్ధత కలిగి పనిచేయవలసిన, ప్రకటనలు ఇవ్వవలసిన బాధ్యత గల పార్టీ పదవిలో ఉన్న మండల అధ్యక్షుడు రవి ఆలోచన లేని ప్రకటనలు చేసి పార్టీలో చులకన కావడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి ప్రకటనల వలన పార్టీ శ్రేణులలో అభద్రతాభావం ఏర్పడుతుందని, ప్రకటనలు చేసే ముందు పార్టీ యొక్క విధివిధానాలకు లోబడి ప్రకటనలు చేయాలని ఆయన హితవు పలికారు.