Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తపాలా శాఖ ఉద్యోగి సత్యనారాయణ మరణం విచారకరం

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రాజు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్థానిక తపాలా శాఖలో (పోస్టాఫీస్) పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న చిందాడ సత్యనారాయణ (47) మరణం విచారకరమని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. మంగళవారం విధులకు వెళుతూ అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మరణించిన ఆయన పార్థివ దేహాన్ని గురువారం తెల్లవారుజామున చింతపల్లి అంబేద్కర్ కాలనీలోని స్వగృహానికి తీసుకురావడంతో విషయం తెలుసుకున్న పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు లు స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, చింతపల్లి, జికే వీధి ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి దారలక్ష్మి, ఏఎంసి మాజీ చైర్ పర్సన్ హాలియా రాణి, వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలతో కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సతీమణి చింతపల్లి 2 ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మిని, కుటుంబ సభ్యులను ఓదార్చి సత్యనారాయణ మృతదేహానికి నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img