విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వేసవికాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలనే సత్సంకల్పంతో మండల కేంద్రంలోని సాడిపేట వీధిలో మహిళలు నడుం బిగించారు. సాడీ పేట వాసులకు త్రాగునీటిని అందించే త్రాగు నీటి కుండీ ని శుభ్రం చేసుకునేందుకు కదిలారు. స్థానిక పంచాయతీ ద్వారా సీసీ రహదారి, త్రాగునీటి కుండీ వద్దకు మెట్లు నిర్మించడంతో సర్పంచ్ పుష్పలతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తాగునీటి కుండిని మహిళలంతా కలసి స్వచ్ఛందంగా శుభ్రం చేసుకున్నారు.