విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.27.05.2024ది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 31తో ముగుస్తుందని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో బాలికలకు 968 సీట్లు, శ్రీ వేంకటేశ్వర కాలేజీలో బాలురకు 792 సీట్లు ఉన్నాయి. పదవ తరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక వుంటుందన్నారు. ఎంపికైన విధ్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు https://admission.tirumala.org/ సంప్రదించాలని సూచించారు.