విశాలాంధ్ర – చీడికాడ (అనకాపల్లి జిల్లా ) : తే.30.01.2024ది. మండలంలోని దండి సురవరం గ్రామంలో చీడికాడ పశు వైద్య అధికారిని డాక్టర్. జి. గాయత్రి దేవి ఆధ్వర్యంలో మంగళవారం జంతు పక్షోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పాడి పరిశ్రమలపై సలహాలు, సూచనలు అందించారు. గాలి కుoట్టి వ్యాధి టీకాలు కూడా వేశారు. పశువులకు హెల్త్ కార్డు అందించారు. రైతు భరోసా కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ద్వారా వివిధ గడ్డి విత్తనాలపై అందుబాటులో ఉంటాయని రైతులు వినియోగించుకోవాలన్నారు. పశువులకు మెడికల్ క్యాప్ నిర్వహించారు కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ కూడా వేశారు.పలు పశువులకు ట్రీట్మెంట్ చేశారు.
జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు. జంతు సంరక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని జి. కొత్తపల్లి కస్తూరిబా బాలికల విద్యా కేంద్రంలో 8వ తరగతి విద్యార్థినిలకు, జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం పెదగోగాడ పశుసంవర్ధక వైద్య అధికారిని డాక్టర్ కె. రాఘవమ్మ మాట్లాడుతూ జంతువుల పట్ల మనుషులు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు విద్యార్థినులకు వివరించారు. పెంపుడు జంతువులను ఏ విధంగా కాపాడుకోవాలి మొదలైన వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయకులు పాడి రైతులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.