Monday, May 20, 2024
Monday, May 20, 2024

యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించని రాజకీయ పార్టీలను తరిమికొట్టండి

యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.07.05.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యాదవ సామాజిక బి.సీ. వర్గాన్ని గుర్తించని రాజకీయ పార్టీలను ఓడించాలని, తరిమి కొట్టాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక గంగా ఫంక్షన్ హాలులో మంగళ వారం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వలస దారులకు పెద్దపీట వేసి, స్థానికులను మరచిన భారతీయ జనతా పార్టీకి ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఫోర్జరీ, రాబరీ, జాతీయ బ్యాంక్ లను మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజా, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన, ఎక్కడో కడప నుండి వచ్చిన సీ.ఎం. రమేష్ కు అనకాపల్లి ఎం. పి. సీటు కేటాయించడం అన్యాయమన్నారు. భారత చైతన్య యువజన పార్టీ (బి.సీ.వై) బలపరచిన అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి నమ్మి అప్పలరాజు యాదవ్ ను చెరకు గడ గుర్తుపై ఓటు వేసి గేలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులు కోడుబోయిన బాబ్జీ యాదవ్, సంఘ0 నేతలు పినబోయిన అప్పారావు యాదవ్, సానబోయిన గోవింద యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img