Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

బి.ఎన్.రోడ్లను ఛిద్రం చేస్తున్న భారీ వాహనాలు …

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.10.04.2024ది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ స్వంత నిధులతో నిర్మిస్తున్న చోడవరం – నర్సీపట్నం బి.ఎన్.రోడ్డును 24 గంటలు అవ్వక ముందే భారీ వాహనాలు ఛిద్రం చేస్తూ, గోతుల పాలు చేస్తున్నాయని ప్రయాణీకులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. గాంధీ గ్రామం చిట్టిబాబు ట్రేడర్స్ (టైల్స్) దుకాణం కు మెటీరియల్ తీసుకు వచ్చే భారీ వాహనాలు తో నిత్యం సమస్యలు వస్తున్నాయని, కొత్తగా వేసిన రోడ్డును కూడా పాడు చేస్తున్నారని, రోడ్లపై నిలువు లోతు గోతులు ఏర్పడి, దుమ్ము ధూళి లేచిపోతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు క్వారీ ల నుండి తెల్ల రాయి దిమ్మ లను భారీ వాహనాలతో ఇదే దారి గుండా రాత్రనక, పగలనక తరలించేవారు. ఏదో ఇన్నాళ్లకు రోడ్లు బాగుపడుతున్నాయని అనుకునే లోపే మళ్లీ యధాస్థితికి తీసుకువస్తుండడంతో స్థానికులు, బాటసారులు, ప్రజా సంఘాల వారు విరుచుకుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img