విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.14.05.2024ది. ఎన్నికల గ్రహణం వీడినా, గెలుపు ఓటములు పై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ వీడలేదు. ఫలితాలు వెలువడేందుకు నెల రోజులు సమయం ఉండటంతో అస్సలు గుబులు నేటి నుండి మొదలైంది. పైకి మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికి, లోన గుబులు దహించివేస్తోంది. వాటికి తోడు పలు సర్వేలు రాజకీయ నేతల గుండెల్లో మరీ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. దీంతో పైకి మేక వన్నె పులి కబుర్లతో కాలక్షేపం వెళ్లదీస్తున్నారు.